_ తాండూరు మండలం లో లభ్యం
_ విచారణ చేపడుతున్న పోలీసులు
_ హత్య ..? ఆత్మహత్య ..? అనేది సస్పెన్స్ గా మారింది
జనవాహిని ప్రతినిధి తాండూరు; ఓ పాడుబడిన ఇంట్లో రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. కుళ్ళి పోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు మండలం ఐనెల్లి గ్రామ సమీపంలో ఆడ,మగ ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఓ పాడు బడిన ఇంట్లో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహలు ఉన్న ప్రాంతంలో పురుగుల మందు డబ్బా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అసలు ఆ ఇద్దరు ఎవరు..? ఏ ప్రాంతానికి చెందిన వారు..? ఇంతకీ ఇది హత్య..? లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన తో స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

