_ విద్యార్థి తల్లీతో అసభ్య ప్రవర్తన
_ దేహశుద్ధి చేసిన స్థానికులు
_ యాలల మండలం లో ఘటన
జనవాహిని ప్రతినిధి తాండూరు; మహాత్మా జ్యోతిభ ఫూలే పాఠశాల ప్రిన్సిపల్ ను స్థానికులు చితకబాదరు. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి తల్లీ తో అసభ్య ప్రవర్తన చేసాడనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటన మంగళవారం యాలల మండలం అగ్గనూర్ గ్రామ సమీపంలో జరిగింది. విద్యార్థి తల్లీ పట్ల ప్రిన్సిపల్ నరేష్ అసభ్యంగా ప్రవర్తించరని స్థానికులు గమనించి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న యాలల పోలీసులు ప్రిన్సిపల్ నరేష్ ను అదుపులోకి తుసుకున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

