- Advertisment -spot_img
HomeNEWSసారే వస్తాడు...!

సారే వస్తాడు…!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి

_ బ్రష్టు పట్టించిన రాష్ట్రాని బంగారం గా మారుస్తాడు
_ రౌడీలతో దాడులు చేయిస్తున్నారు రేవంత్ రెడ్డి
_ రాష్ట్ర ప్రజలందరూ కెసిఆర్ కోసం ఎదురుచూస్తున్నారు
_ ఇంకా మీ ఆటలు సాగవు ; తాండూరు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు; తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, 10ఏళ్ళు రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న మహాత్ముడు కెసిఆర్ చావును కోరుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రం లో అల్లర్లు సృష్టిస్తూ ఎర్రవెల్లి కి రౌడీలను పంపుతున్న రేవంత్ రెడ్డి అంటూ తాండూరు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం లో దొంగ హామీలు చూపించి గెలిచినా కాంగ్రెస్ పార్టీని అతి తొందర్లోనే బొందపెడతాం అని హెచ్చరించారు. అసెంబ్లీ కి కెసిఆర్ రావాలి సారు రావాలి అని పదే పదే పిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి ఎదురుకునే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రం లో దొంగ కేసులు ప్రశ్నిస్తే రిమాండ్ లు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిదంగా తాండూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయకులు చేసే అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి రిమాండ్ కు పంపుతున్నారని అగ్రహించారు. ప్రతిపక్ష పార్టీ గా ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాల్సింది పొయ్యి కౌంటర్ లు ఇస్తున్నారన్నారు. తాండూరు అభివృద్ధి ని గాలికి వదిలేసి కౌంటర్ లు వ్యక్తిగత దుషనాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు అయినా 1000 రోజుల్లో ఎన్ని హామీలు అమలు చేసారాని ప్రశ్నించారు. దొంగ హామీల పేర్లు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారే తప్ప ఎలాంటి అభివృద్ధి కానీ, హామీలు కాని నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాండూరు వనరులను కొడంగల్ కు తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పై ప్రజలు దుమ్మేతి పోస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కి కాలం చెల్లిందని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ కి తాండూరు ప్రజలు మద్దతుగా ఉన్నారని మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి, తాండూరు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నాయకులు కోహిర్ శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సంతోష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments