- నీ స్థాయి ఎంతో తెలుసుకుని మాట్లాడు
- అక్రమ దందాలు మరచిపోయావా నాగరాజ్?
- కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజ్పై కౌన్సిలర్ ఇర్షాద్ తీవ్ర ఆగ్రహం
జనవాహిని ప్రతినిధి తాండూరు: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజ్ తన రాజకీయ స్థాయిని, తన గతాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ మండిపడ్డారు.
నడిరోడ్డుపై మనిషిని చంపిన చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నాగరాజ్, రోహిత్
రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అక్రమంగా ఇసుక దందాలు నడిపే నీకు ఆయన గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజలకు 10 నుండి 20 రూపాయల వడ్డీలకు డబ్బులిచ్చి వారి రక్తం తాగే వడ్డీ వ్యాపారివని ఆరోపించారు. నాగరాజ్ కుటుంబం అక్రమాలకు అడ్డగా మారిందని, రోజూ మద్యం తాగి చిన్న చిన్న కుటుంబాలను, వారి పిల్లల భవిష్యత్తును పాడుచేసే వ్యక్తివని తీవ్ర ఆరోపణలు చేశారు.
నడిరోడ్డు వివాదాలు, ఎన్టీఆర్ కాలనీలో ఒక మహిళకు సంబంధించిన ఘటనలో పాత్ర, వాగుల నుంచి అక్రమ మట్టి తరలింపు వ్యాపారాలపై ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల క్రితం వరకు రోహిత్ రెడ్డి వద్దకు వెళ్లి కాళ్లు మొక్కి సహాయం పొందిన నాగరాజ్, ఇప్పుడు అవసరం తీరిన తర్వాత మాట మార్చడం ఆయన దిగజారుడు రాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. సహాయం పొందిన వ్యక్తిపైనే స్థాయి దాటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ విలువలకు విరుద్ధమన్నారు. తన వార్డ్ లో 400ఓట్లతో ఓడిపోయినా రాజకీయం నాగరాజు ది అని అలాంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పై విమర్శలు చేయ్యడం విడ్డురంగా ఉందన్నారు. నడి రోడ్డు పై మర్డర్ లు చేసిన కుటుంబానికి పదవులు కట్టబెట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదాని ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోపణలు చేయడం సులభమేనని, ఆధారాలతో మాట్లాడటమే అసలు విషయమని స్పష్టం చేశారు. నాగరాజ్ ఇప్పటికైనా స్థాయి లేని వ్యక్తిగత విమర్శలు, అక్రమ దందాలు మాని ప్రజా సమస్యలపై మాట్లాడాలని కౌన్సిలర్ ఇర్షాద్ స్పష్టం చేశారు.



