- తాండూరులో ముమ్మరంగా వినాయక చవితి చందాల సేకరణ
- హిందూ ఉత్సవ సమితికి విరాళం అందజేసిన నేతాజీ పాఠశాల యాజమాన్యం
జనవాహిని ప్రతినిధి తాండూరు;రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తాండూరు పట్టణంలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు హిందూ ఉత్సవ సమితి శ్రీకారం చుట్టింది. ఇటీవల నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో చందాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బిర్కెట్ రఘు నేతృత్వంలో ఉత్సవ సమితి ప్రతినిధులు పట్టణంలోని ముఖ్య వీధులు, వ్యాపార, విద్యా సంస్థ సందర్శనకు బయలుదేరారు. ఇందులో భాగంగా స్థానిక నేతాజీ పాఠశాల యాజమాన్యాన్ని కలవగా, పాఠశాల నిర్వాహకులు ఉత్సవాల నిర్వహణకు గాను తమవంతుగా నగదు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని ఉత్సవ సమితి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ప్రధాన కార్యదర్శి బిర్కెట్ రఘు మాట్లాడుతూ…భక్తిశ్రద్ధలు, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగేలా ప్రణాళికలు వేస్తున్నట్లు వివరించారు. వినాయక చవితి పండుగకు తాండూరు ప్రాంత యువకులు పెద్దలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కోశాధికారి కిరణ్, కమిటీ ముఖ్య బాధ్యులు,తదితరులు పాల్గొన్నారు.



