- Advertisment -spot_img
HomeNEWSగోకులంగా మారిన పాఠశాల..!

గోకులంగా మారిన పాఠశాల..!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
  • తాండూరులో అలరించిన కృష్ణాష్టమి సంబరాలు
  • సాయి మేధ, ఆపిల్ కిడ్స్ స్కూళ్లలో ఉట్టికొట్టే వేడుకలు

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కోలాహలంగా జరిగాయి. నల్లనయ్య, అల్లరి కృష్ణుడు, గోపికాలోలుడైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నారులు వేసిన కృష్ణుడు, గోపికలు మరియు దశావతారాల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టికొట్టే పోటీలలో బాలకృష్ణుడి రూపంలో ఉన్న చిన్నారులు పోటీపడి పైకి ఎగురుతూ పెరుగు ఉట్టిని పగలగొట్టడం ప్రతి ఒక్కరినీ అలరించింది.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను మరువకూడదని పిలుపునిచ్చారు. చిన్ననాటి నుంచే పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పాఠశాలల్లో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు.
ఈ వేడుకలలో హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments