- బుయ్యని సోదరుల సేవా కార్యక్రమాలపై విమర్శలు సరికావు
- తాండూర్ యువ నేత వికాస్ జోషి
జనవాహిని ప్రతినిధి తాండూరు; మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారంపై స్పష్టత ఇవ్వలేని వారు.. నిరంతరం ప్రజా సేవలో ఉన్న బుయ్యని సోదరులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని తాండూర్ నియోజకవర్గ యువ నేత వికాస్ జోషి మండిపడ్డారు. ఈ సందర్బంగా అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ … ఇతరులపై విమర్శలు చేసే ముందు తమ రాజకీయ నిర్ణయాలు, వ్యవహారాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాండూర్ ప్రాంతంలో గుడులు, బడులు అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూముల కబ్జాపై మాట్లాడేవారు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు.
బుయ్యని శ్రీనివాస్ రెడ్డి షాడో ఎమ్మెల్యే కాదని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టసుఖాలు పంచుకునే ప్రజా సేవకుడని స్పష్టం చేశారు. 2020లో కరోనా కష్టకాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఉచితంగా శానిటైజర్లు పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. కుల, మత, వర్గ, వయోభేదాలకు అతీతంగా ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడం బుయ్యని సోదరుల నైజమని కొనియాడారు.
బుయ్యని సోదరులు అందిస్తున్న సేవలను చౌకబారు విమర్శలతో తగ్గించలేరని, ఎవరు ఎలాంటి వారో ప్రజలందరూ గమనిస్తున్నారని వికాస్ జోషి హెచ్చరించారు.



