- తాండూరులో కొత్త రెస్టారెంట్
- ప్రారంభించిన మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు; పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్విబి రెస్టారెంట్’ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. నిరోషా వీరేష్ దంపతులు నిర్వహించనున్న ఈ రెస్టారెంట్ను తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి మరియు స్థానిక వార్డ్ కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ… పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు శుచి, రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఈ రెస్టారెంట్ అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. వ్యాపారంలో యజమానులు మంచి పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ లు జంటుపల్లి వెంకట్, కిరణ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



