- రేపు తాండూరులో మాంసం విక్రయాలు బంద్
- నోటీసులు అందజేసిన మున్సిపల్ సిబ్బంది
జనవాహిని ప్రతినిధి తాండూరు; శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకుని తాండూరు పట్టణ పరిధిలో మాంసం విక్రయాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు పురపాలక సంఘం కమీషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం జన్మాష్టమి సందర్భంగా పట్టణంలోని మటన్, చికెన్, చేపల దుకాణాలు, పశువుల/మేకల కటేళాలు మరియు హోటళ్లలో మాంసాహారం విక్రయించరాదని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా మాంసాహారాన్ని విక్రయిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా మున్సిపల్ సిబ్బంది మాంసం దుకాణదారులకు నోటీసులు అందజేశారు. వ్యాపారులు, హోటళ్ల యజమానులు మరియు పట్టణ ప్రజలు ఈ నిర్ణయానికి సహకరించాలని కోరారు.



