- తాండూరు పొట్లి మహారాజ్ దేవాలయ నూతన చైర్మన్ గా సుదర్శన్ గౌడ్
- ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు ..!
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణంలోని ప్రముఖ శ్రీ పొట్లి మహారాజ్ దేవాలయ నూతన చైర్మన్ గా సుదర్శన్ గౌడ్ నియామకం దాదాపు ఖరారైంది. ఆలయ పాలకమండలి నూతన చైర్మన్ ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, మురళి గౌడ్, రాజు గౌడ్, రవి గౌడ్ లు సుదర్శన్ గౌడ్ పేరును స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఆమోదం కోసం ప్రతిపాదించారు.
పార్టీ నాయకుల ప్రతిపాదనపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సుదర్శన్ గౌడ్ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
తన పేరును చైర్మన్ పదవికి ప్రతిపాదించి, ఆమోదం తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్, మురళి గౌడ్, రాజు గౌడ్, రవి గౌడ్ లకు సుదర్శన్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు, దేవాలయ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సుదర్శన్ గౌడ్ నియామకంపై కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.



