Home Blog Page 2

ఎమ్మెల్సీ ని సస్పెండ్ చేయ్యాలి…

0

_ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు
_ చర్యలు తీసుకోవాలని పిర్యాదు

జనవాహిని ప్రతినిధి తాండూరు: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్ డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో పార్టీ నాయకులతో కలిసి పిర్యాదు చేశారు. అసభ్య పదజాలం తో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ను దుషించడం సరికాదని మండిపడ్డారు. వెంటనే భాహిరంగంగా తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి అసభ్య పదజాలం తో దుశించిన తాతా మధు ను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్, ఉర్దూఘర్ చైర్మన్ జలాల్, సుదర్శన్ గౌడ్, వెంకటేష్, బాలరాజు, జోగుల ఎబినైజర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో కలకలం.. మాజీ ఎమ్మెల్యే సహా 18 మందికి నోటీసులు

0
  • తెలంగాణ కాంగ్రెస్‌లో 18 మంది నేతలకు షోకాజ్ నోటీసులు
  • పార్టీ సమావేశాల్లో గొడవలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు
  • మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహా పలువురు ముఖ్య నేతలకు నోటీసులు
  • వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశం

తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిన నేతలపై పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలకు సిద్ధమైంది. పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన 18 మంది నాయకులకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆదివారం గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు అందుకున్న నేతలు వారం రోజుల్లోగా తమ వివరణ సమర్పించాలని కమిటీ ఆదేశించింది.

ఆదిలాబాద్, గజ్వేల్, సిరిసిల్ల, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో జరిగిన వివాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలపై అందిన ఫిర్యాదులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ చర్యలు చేపట్టింది. నోటీసులు అందుకున్న వారిలో గజ్వేల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జూపల్లి మల్లారెడ్డి వంటి కీలక నేతలు ఉన్నారు. వీరితో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డిలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

పెద్దపల్లి ఎంపీ వంశీ కారుపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆరుగురిపై, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సింగితం శ్రీనివాస్ అందజేసిన ఫిర్యాదు మేరకు మరో ఏడుగురిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. కరీంనగర్‌కు చెందిన మూల లక్ష్మికి కూడా నోటీసు జారీ చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. పార్టీ నియమావళిని తాను ఎన్నడూ ఉల్లంఘించలేదని, ఎవరిపైనా కక్ష సాధింపు ధోరణితో నివేదికలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేవలం పార్టీలో క్రమశిక్షణను కాపాడటంలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆయన వివరించారు.

గురువులకు ఘన సన్మానం…!

0
  • గురువుల రుణం తీర్చుకోలేనిది
  • యువ వ్యాపారవేత్త కటకం హరీష్

జనవాహిని ప్రతినిధి తాండూరు;సమాజ నిర్మాణంలోనూ, ప్రతి ఒక్కరి ఉన్నతిలోనూ ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని యువ వ్యాపారవేత్త కటకం హరీష్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తమ పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కటకం హరీష్ మాట్లాడుతూ—తాను వ్యాపార రంగంలో స్థిరపడి ఈ స్థాయికి చేరుకోవడానికి చిన్నతనంలో ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు మార్గదర్శకత్వమే పునాది అని స్పష్టం చేశారు. కేవలం విద్యాబుద్ధులే కాకుండా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యాన్ని నాడు గురువులు నూరిపోశారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఆవేదనతో కూడిన ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం తమకు పాఠాలు చెప్పిన గురువులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు. ఒకప్పుడు తమ వద్ద చదువుకున్న విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబడి, ఈ రకంగా గౌరవించడం పట్ల ఉపాధ్యాయులు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ హరీష్‌ను, ఆయన మిత్రబృందాన్ని మనసారా ఆశీర్వదించారు. ఎంత ఎదిగినా కన్నవారిని, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మరచిపోకూడదనే సందేశాన్ని చాటిచెప్పిన కటకం హరీష్‌ను స్థానికులు కొనియాడారు.

ఎస్విబి రెస్టారెంట్’ ప్రారంభోత్సవం..!

0
  • తాండూరులో కొత్త రెస్టారెంట్
  • ప్రారంభించిన మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి 

జనవాహిని ప్రతినిధి తాండూరు; పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్విబి రెస్టారెంట్’ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. నిరోషా వీరేష్ దంపతులు నిర్వహించనున్న ఈ రెస్టారెంట్‌ను తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి మరియు స్థానిక వార్డ్ కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ… పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు శుచి, రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఈ రెస్టారెంట్ అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. వ్యాపారంలో యజమానులు మంచి పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ లు జంటుపల్లి వెంకట్, కిరణ్,  పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దేవాలయ అభివృద్ధిపై బురద జల్లడం తగదు

0
  • 40 లక్షల ప్రొసీడింగ్స్ ఇప్పటికే అందజేసిన ఎమ్మెల్యే
  • స్థాయికి మించి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం: భద్రేశ్వర ఆలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరులోని భద్రేశ్వర ఆలయ ప్రాంగణ అభివృద్ధి, అన్నదాన సత్రం నిర్మాణంపై బిఆర్ఎస్ నాయకులు పటేల్ కరుణాకర్ కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పటేల్ కిరణ్ మాట్లాడుతూ …
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమానికి, దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే ఇప్పటికే ₹40 లక్షల ప్రొసీడింగ్స్ మంజూరు చేశారని, త్వరలోనే మరో ₹20 లక్షల నిధులు అందజేస్తారని తెలిపారు. వీరశైవ సమాజానికి ఇచ్చిన మాట ప్రకారం ₹25 లక్షల నిధులు కూడా త్వరలోనే విడుదలవుతాయని స్పష్టం చేశారు.
దేవాలయంలో అన్నదాన సత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వల్ప వ్యవధిలోనే నిర్మించి అందుబాటులోకి తెచ్చామని, ఈ నిర్మాణంలో బసవరాజ్ సార్, వీరశైవ సమాజ నాయకులు, యువత, భజన మండలి సభ్యులు ఎంతో సహకరించారని గుర్తుచేశారు. భజన మండలి సభ్యులు ₹1,01,016 విరాళంగా ఇచ్చారని, సమాజం ద్వారా సేకరించిన నిధులన్నీ ఆలయ అభివృద్ధికి పారదర్శకంగా వినియోగించామని వివరించారు.
తేరు సామాగ్రి భద్రపరిచే షెడ్డు నిర్మాణానికి సంబంధించి నాయకుడు కోకల్ రవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, ఆ పని కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు. ప్రచార ఆర్భాటాల కోసం స్థాయికి మించి మాట్లాడటం తగదని, కొంచెం ఓపిక పడితే ఎమ్మెల్యే నాయకత్వంలో అభివృద్ధి పనులన్నీ క్రమంగా పూర్తవుతాయని విమర్శకులకు హితవు పలికారు.

వెయ్యి రోజుల్లో ప్రగతి పరుగు…!

0
  • తాండూరు అభివృద్ధికి 1000 రోజుల్లో ₹1200 కోట్లు
  • ఇవి ఉత్తుత్తి జీవోలు కావు… అక్షర సత్యాలు
  • అభివృద్ధి ఆధారాలతో బ్రోచర్ విడుదల చేసిన కాంగ్రెస్ నాయకులు
  • అబద్ధమైతే చర్చకు రావాలని సవాల్

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి గడిచిన వెయ్యి రోజుల పాలనలో రూ.1200 కోట్ల నిధులు వెచ్చించామని, ఇవి కాగితాలకే పరిమితమైన ఉత్తుత్తి జీవోలు కావు అని, అక్షర సత్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. తాండూరు ప్రజలు అభివృద్ధిని, ఆదర్శవంతమైన రాజనీతిని కోరుకుంటున్నారని, ఉద్రేకాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలని చూసే కుటిల రాజకీయాలను వారు తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు.  ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు బాల్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి కె. గోపాల్, వసీం, ఓల్డ్ తాండూరు వసీం, కౌన్సిలర్ ఎల్లప్ప లు మాట్లాడుతూ…
1000 రోజుల్లో చేపట్టిన రూ.1200 కోట్ల అభివృద్ధి పనుల సమగ్ర వివరాలతో కూడిన ‘అభివృద్ధి బ్రోచర్’ను వారు విడుదల చేశారు.
ఈ బ్రోచర్‌ను నేరుగా ప్రజాక్షేత్రంలోనే ఉంచుతున్నామని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని నాయకులు ప్రకటించారు. బ్రోచర్‌లో పేర్కొన్న వివరాలు అబద్ధమైతే ప్రతిపక్షాలు ఆధారాలతో సహా ముందుకు రావాలని సవాల్ విసిరారు. వచ్చే ఐదేళ్లలో కేవలం ఎన్నికల లబ్ధి కోసం కాకుండా, రాబోయే భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పనిచేసే నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటునరని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆచరిస్తున్న రాజనీతిజ్ఞతకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. నియోజకవర్గాన్ని మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
గత ఐదేళ్ల పాలనలో నియోజకవర్గానికి రావాల్సిన నిధులు ఎందుకు విడుదల కాలేదు? ఆ నిధులు ఎక్కడికి తరలిపోయాయో విపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 1000 రోజుల కాంగ్రెస్ పాలనలోనే తాండూరు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విధ్వంసకర పాలన నుంచి వికాసం వైపు వేగంగా అడుగులు వేస్తోందని నాయకులు స్పష్టం చేశారు.

శిశు మందిర్‌కు ₹5 లక్షల విరాళం..!

0
  • శిశు మందిర్ వికాసానికి ఆర్బీఓఎల్ సీఈఓ విరాళం
  • విద్యార్థులే భారత నిర్మాతలు
  • కాంగ్రెస్ నాయకులు ఆర్బిఓఎల్ సీఈఓ   శ్రీనివాస్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు ఆర్బీఓఎల్ సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు రూ. 5,00,000 విలువైన చెక్కును ఆయన నేరుగా అందజేశారు.
ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తును నిర్మించే శిల్పులని పేర్కొన్నారు. ప్రాచీన సంస్కృతి, నైతిక విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో సరస్వతీ విద్యా పీఠం, శిశు మందిర్ పాఠశాలలు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమన్నారు. పిల్లల్లో దేశభక్తి, సామాజిక స్పృహ పెంపొందిస్తున్న ఈ విద్యాలయాల వికాసానికి తనవంతు బాధ్యతగా ఈ సాయం అందించానని, మున్ముందు కూడా పాఠశాలకు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లేశం, పాఠశాల అధ్యక్షుడు కటకం వీరేందర్, యాజమాన్య కమిటీ సభ్యులు పెరుమాళ్లా రాం రెడ్డి, అనంత రెడ్డి, జి. నరేందర్ పాల్గొన్నారు. వీరితో పాటు కౌన్సిలర్లు జుంటుపల్లి వెంకట్, ఎం. రామకృష్ణ, ఎన్. రాజు గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, భీంశెట్టి మధుసూదన్, సుబ్బారావు, ప్రభుశంకర్, జోషి వికాస్, ప్రహ్లాద్, సమద్, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాండూరు కొడంగల్ కవలపిల్లలా. .!

0
  • తాండూరును వదిలి కొడంగల్‌పైనే ప్రేమ ఎందుకు?
  • కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు
  • రోహిత్ రెడ్డిపై చిల్లర వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని హెచ్చరిక

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం పైనే ఆరాటం చూపుతున్నారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. స్థానిక సమస్యలను గాలికొదిలేసి కొడంగల్ సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ…
తాండూరులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండి ప్రజలు అల్లాడుతుంటే ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఆసుపత్రులు, చివరికి తాండూరు ఇసుకను కూడా కొడంగల్‌కే తరలిస్తుంటే ఇక్కడి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు భూకబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల అక్రమాల చిట్టా తమ వద్ద ఆధారాలతో సహా ఉందని, త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రాంతంలో గంజాయి సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిందని, అభివృద్ధి పేరిట ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుకుంటూ దోచుకుంటున్నారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన స్థాయి కూడా లేని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోహిత్ రెడ్డిపై నోరుపారేసుకుంటే సహించేది లేదని, అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొడంగల్ మోజు వీడి తాండూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లు ఇర్షాద్,సురేష్ నాయక్ అనిల్ బోయ, నాయకులు రుద్రు పాటిల్,సంతోష్ గౌడ్,అసిఫ్,కరుణాకర్, ఏజాస్,అనంతరెడ్డి,తదితరులు ఉన్నారు.

అణచివేస్తే ఉద్యమం ఉధృతం..!

0
  • 1000 రోజుల కాంగ్రెస్ వైఫల్యాలపై బిఆర్ఎస్వి పోరుబాట
  • ఇందిరా చౌక్‌ను ముట్టడించిన ‘జెన్ జీ’ యువత..
  • కాంగ్రెస్ పై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు; రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బిఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూరు లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలి ఇందిరా చౌక్ వద్దకు యువత భారీగా తరలిరావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ఇందిరా చౌక్ పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు చేశారు. గత ఎన్నికల ముందు విద్యార్థులను, నిరుద్యోగులను ఆకట్టుకునేలా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ను నిలదీస్తున్న యువత గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పోరాటాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని, అవసరమైతే ఈ ప్రభుత్వ పీఠాన్ని కదిలించేందుకు యువత సిద్ధంగా ఉంది అని స్పష్టం చేశారు. నాయకులు, విద్యార్థులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మున్ముందు ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని బిఆర్ఎస్వి నేతలు హెచ్చరించారు.

మాణిక్ రావును మరువలేము…!

0
  • తాండూరు అభివృద్ధికి మాణిక్‌రావు సేవలు చిరస్మరణీయం
  • మాజీ మంత్రి జయంతి వేడుకల్లో జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్
  • ఘనంగా నివాళులర్పించిన బీసీ సంఘం నాయకులు

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు ప్రాంత సమగ్ర అభివృద్ధికి, నియోజకవర్గంలో ప్రాజెక్టుల నిర్మాణానికి స్వర్గీయ మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ కొనియాడారు. ‘తెలంగాణ సర్దార్’గా పేరుగాంచిన మాణిక్‌రావు జయంతి వేడుకలను తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులార్పించారు.
అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో జైలు జీవితం అనుభవించిన పోరాట యోధుడు మాణిక్‌రావు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీల హక్కులు, సమస్యలపై తొలిసారిగా బలంగా గళమెత్తిన ధీరుడని గుర్తుచేశారు.
తాండూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కోట్పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులను తీసుకువచ్చిన ఘనత మాణిక్‌రావుకే దక్కుతుందన్నారు. వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో తాండూరులో ‘పీపుల్స్ డిగ్రీ కళాశాల’ను ఏర్పాటు చేసి, వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేశారని గుర్తు చేశారు.
మాణిక్‌రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, వడ్డెర సంఘం జిల్లా నాయకులు వడ్డే సత్యనారాయణ, మండలాల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, బసంత్ కుమార్, యువ నాయకులు జోసఫ్, శ్రీకాంత్, బసవరాజ్, నాయి రాజు, అరుణ్ రాజ్, మోచిరాజు, పవన్, శివకుమార్, వివేక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.