- తాండూరు మున్సిపాలిటీలో నిధుల గోల్మాల్పై ఆర్టీఐ వేసిన జావీద్
- మైనర్ డ్రైవింగ్కు అడ్డుకట్ట వేయాలి
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పురపాలక సంఘంలో ప్రజాధనం విచ్చలవిడిగా దుర్వినియోగమవుతోందని, దీనిపై అధికారులను నిలదీస్తూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసినట్లు బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ జావీద్ తెలిపారు. ఈ సందర్బంగా జావీద్ మాట్లాడుతూ….
పట్టణంలో మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలు తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. పిల్లలకు 18 ఏళ్లు నిండి, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతే వాహనాలు ఇవ్వాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా తాండూరు
మున్సిపాలిటీలో అవినీతి తాండవిస్తోందని కౌన్సిలర్ జావీద్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో నెలకు 2,000 లీటర్ల డీజిల్ వాడితే, రికార్డుల్లో మాత్రం 4,000 లీటర్ల బిల్లులు చూపిస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. డీజిల్ వినియోగం, సానిటేషన్ మెటీరియల్ కొనుగోళ్లపై పూర్తి వివరాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ను ఆర్టీఐ ద్వారా కోరినట్లు వెల్లడించారు.
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు సహకరిస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. బాధ్యులపై విజిలెన్స్ విచారణ జరిపించి కోర్టు వరకు తీసుకెళ్తామన్నారు. కేవలం ప్యాచ్ వర్క్లకే పరిమితం కాకుండా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీఐకి సరైన సమాధానం రాకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.










