AP TS BJP Candidates List : బీజేపీ లోక్ సభ అభ్యర్థుల ఐదో జాబితాను(BJP Fifth List) విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 111 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయింది. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో(AP BJP Candidates) పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో 6 ఎంపీ అభ్యర్థులను బీజేపీ ఐదో జాబితాలో ప్రకటించింది. అయితే నర్సాపురం టికెట్ ఆశించిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది. నర్సాపురం టికెట్ ను భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది. ఇప్పటికే తెలంగాణలో 15 మందికి సీట్లు ఖరారు చేసిన బీజేపీ(TS BJP Candidates) తాజాగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్‌ (ఎస్సీ) స్థానానికి ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్‌ కు, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌రావును సీటు కేటాయించింది.